Sunday, January 9, 2011

జోరు తగ్గిన ఐపీయల్ వేలం

AA 
జయసూర్యకు పలకని గుడ్ విల్ 
ఐపీఎల్ క్రికెటర్ల వేలంపాట రెండోరోజు జోరు తగ్గింది. ఇప్పటికే స్టార్ క్రికెటర్ల వేలంపాట పూర్తవడంతో... ఫ్రాంఛైజీలు సెలక్టివ్‌గా వ్యవహరిస్తున్నాయి. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ డ్యాన్ క్రిస్టియన్‌ను అత్యధికంగా 4 కోట్ల రూపాయల బిడ్డింగ్‌ వేసి డెక్కన్ ఛార్జర్స్ సొంతం చేసుకుంది. భారత ఆటగాళ్లలో ఉమేష్ యాదవ్‌ను 3 కోట్ల 40 లక్షలకు పాడుకొని ఢిల్లీ సొంతం చేసుకుంది.
3 కోట్ల 20 లక్షలకు ముంబై ఇండియన్స్ మునాఫ్ పటేల్‌కు దక్కించుకుంది. బాలాజీ, వినయ్ కుమార్‌లకు రెండు కోట్ల పైనే పలుకగా... అజిత్ అగార్కర్‌ను 95 లక్షలకు ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. కాగ శ్రీలంక వెటరన్ సనత్ జయసూర్య, ఓరమ్, డ్వెయిన్ స్మిత్, బొపారా, బ్రెన్సన్‌ తదితరలపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.

No comments:

Post a Comment