Tuesday, January 11, 2011

నేను తల్చుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది : జగన్


AA

 
ప్రభుత్వాన్ని కూల్చడం నా అభిమతం కాదు - జగన్‌ 
  నా మద్దతుదారులు కొత్త పార్టీ తరపున పోటిచేస్తారు - జగన్‌


తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తల్చుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని, అయితే అది తన అభిమతం కాదని యువనేత జగన్‌ అన్నారు. జలదీక్ష సందర్బంగా ఢిల్లీలో నేషనల్‌ మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తన మద్దతుదారులు కొత్త పార్టీ తరపున బరిలో దిగుతారని ఆయన స్పష్టం చేశారు.

వై యస్ జగన్ పై బాబు నిప్పులు..


విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై, దివంగత నేత వైయస్సార్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. మన దేశంపై దండెత్తి వచ్చిన గజనీలు కేవలం బంగారాన్ని, డబ్బునే దోచుకు పోయారని కాని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మాత్రం చివరకు భూమిలో ఉన్న ఖనిజాలను కూడా దోచుకున్నారని ఆయన మంగళవారం కృష్ణా జిల్లాలో కైకలూరు పర్యటనలో విమర్శించారు. వైయస్ తన హయాంలో కొల్లేరు ప్రాంతంలో 7500 ఎకరాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారన్నారు. వైయస్ తీవ్ర అవినీతికి పాల్పడితే కొడుకు జగన్ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఢిల్లీలో దీక్ష చేయకుండా అవినీతికి పాల్పడిన వైయస్ సమాధి వద్ద చేయాలని జగన్‌కు సూచించారు.

అక్రమంగా స్వాధీనం చేస్కున్న పేదల భూములను వారికి ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ వారి తరఫున పోరాడుతుందన్నారు. రైతులకు ధైర్యం చెప్పడానికి, కష్టాలు తెలుసుకోవడానికే తాను వచ్చనన్నారు. పేదలపై ప్రభుత్వం ఆటలు సాగనివ్వమన్నారు. సమాజంలో అవినీతి పెరిగితే సమస్యలు వస్తాయన్నారు. పేదల పేదలుగానే ఉండిపోవడానికి పెద్దలు మాత్రం మరింత ఆస్తులు కూడబెట్టుకోవడానికి కారణం అవినీతి అన్నారు. కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డికి వైయస్ అక్రమంగా వేల కోట్ల రూపాయల విలువ చేసే ఖనిజాన్ని కట్టబెట్టారని, ఆ ధనంతో ఆయన ఎంపీలను, ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు.

రోడ్లు వేయించింది విగ్రహాలు పెట్టుకోవడానికి కాదని, ప్రయాణం చేయడానికి అని జగన్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న వైయస్ విగ్రహాలనుద్దేశించి అన్నారు. 2జి స్పెక్ట్రం, కామన్వెల్తు కుంభకోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్లు అవినీతికి పాల్పడిందన్నారు. కాని పేదలను ఆదుకోవడానికి మాత్రం వెనుకాడుతుందన్నారు. పేదల అభివృద్ధికి పాల్పడింది ఒక్క తెలుగుదేశం పార్టీయే నన్నారు. కొల్లేరు మత్స్యకారులను న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన చెప్పారు. వైయస్ ఆపరేషన్ కొల్లేరు తర్వాత 40 శాతం మందికి పైగా మత్స్యకారులు వలస వెళ్లి దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. కొల్లేరు రైతుల న్యాయం కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతామని చెప్పారు. రాష్ట్రంలో రైతులు, కొల్లేరు మత్స్యకారులు తీవ్ర నష్టాల్లో ఉన్నారన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు కారణంగా కైకలూరుకు నీరు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. దేవేగౌడకు అలమట్టి కట్టవద్దని తాను చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. దళితులకు, బీసీలకు రాజకీయ గుర్తింపునిచ్చింది తెలుగుదేశం పార్టీయేనన్నారు.

Monday, January 10, 2011

సెమీ న్యూడ్ అయినా రెడి..!



ఆరెంజ్ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన షాజన్ పదంసి తాను బికినీవేయటానికైనా లేదా సెమీ న్యూడ్ గా కనిపించాలన్నా కూడా అభ్యంతరం లేదంటోంది. ఎక్స్‌పోజింగ్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అని మీడియా వారు ప్రశ్నించినప్పుడు ఇలా స్పందించింది. అలాగే ఎక్స్‌పోజింగ్ విషయంలో నాకు ఎలాంటి నిబంధనలు లేవు. లిప్ టు లిప్‌ కిస్ నుంచీ టూ పీస్ బికినీ వరకూ, ఆ మాటకొస్తే సెమీ న్యూడ్.. కూడా నేను సిద్దమే.అవి కూడానటనలో భాగమే కదా. కాకపోతే కమర్షియల్ యాంగిల్ కోసమైతే నేను ఒప్పుకోను. అదే సినిమాలో సన్నివేశం డిమాండ్ చేస్తే అభ్యంతరం లేదు అంటోంది షాజన్. ఎటువంటి ఎక్స్‌పోజింగ్‌కైనా రెడి అంటున్న ఆమెకు త్వరలో తెలుగులో అవకాశాలు వచ్చే వాతావరణం కనపడుతోంది. ఆరెంజ్ తర్వాత ఆఫర్స్ గురించి చెపుతూ... ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా వున్నాను. తెలుగు నుంచీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ నాకు నచ్చిన కథలు, పాత్రలు ఇప్పటి వరకు ఎవ్వరూ నా దగ్గరికి తీసుకు రాలేదు. హిందీ సినిమాల నుంచి ఖాళీ దొరికినప్పుడు తెలుగు సినిమాల గురించి ఆలోచిస్తాను అంది.