Friday, January 7, 2011

ఫ్యాక్షన్ ఉచ్చులో బాలయ్య సినిమా


కోట్లు ఖర్చు పెట్టి మరీ వరసగా భయంకరమైన ప్లాపులిచ్చిన నిర్మాత సింగనమల రమేష్ బాబు దగ్గర ఒక్క ఏడాదిలో వంద కోట్లు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయో అనుకునే వాళ్లకి ఫ్యాక్షన్ రారాజు మద్దెల చెరువు సూరి హత్యే సమాధానం అయ్యింది. ఖలేజ, పులి లాంటి రెండు అడ్డగోలు చిత్రాలను సూరి దగ్గర నుండి ఫైనాన్స్ తీసుకునే సి కళ్యాణ్, సింగనమలలు పూర్తి చేసి విడుదల చేసారని దర్యాప్తులో తేలడంతో ఇంకెంత బాకీ ఉన్నారన్నదే అసలు క్వశ్చన్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇచ్చిన షాక్ తో ఒళ్లు గుల్ల చేసుకున్న సింగనమల హైదరాబాద్, బెంగుళూరులలో ఉన్న తన ఆస్థి మొత్తం సూరికి అప్పగించేస్తే కళ్యాణ్ మాత్రం ‘పరమ వీర చక్ర’ మీదనే ఆశలు పెట్టుకుని బతుకుతున్నాడు. మరి సూరి ఫ్యాక్షన్ అనుచరులు బాకీ కింద పరమ చెత్తగా తయారయ్యిందన్న పరమ వీర చక్రను జప్తు చేస్తారా లేక వదిలేస్తారా అన్నది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోతుందేమో చూడాలి.

No comments:

Post a Comment