Thursday, January 6, 2011

ఎన్టీఆర్‌ తో ‘గర్జన’కు బోయపాటి !

అందాల ముద్దుగుమ్మ త్రిష అతి త్వరలో నందమూరి వారి కాంపౌండ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధంగా వుంది. నందమూరి బాలకృష్ణతో ‘సింహా’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాను నిర్మించిన బోయపాటి శ్రీను అతి త్వరలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. కెఎస్‌ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించబోతోందనే వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రానికి ‘గర్జన’అనే టైటిల్‌ని ఖరారు చేశారట. ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఎన్టీర్‌ ‘శక్తి’ చిత్రంలో నటిస్తూ బిజీగా వున్నాడు. బోయపాటి శ్రీను కూడా ‘గర్జన’ కథకు పదునుపెడూ బిజీగా వున్నాడు.

No comments:

Post a Comment